ఏపీ టెట్ రిజల్ట్స్ వెలువడ్డాయి. జూన్లో నిర్వహించిన టెట్ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్న వారు 51 శాతం మంది.. రెగ్యులర్ అభ్యర్థుల్లో 47 శాతం మంది పాస్ అయ్యారు. టెట్ క్వాలిఫై అయిన వారికి మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. ఏపీ టెట్ పోర్టల్తో పాటు వాట్సాప్ ద్వారా కూడా టెట్ రిజల్స్ట్ తెలుసుకునే అవకాశం కల్పించారు. టెట్ మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ ఉండటంతో ఈ ఫలితాలు ఉపయోగపడనున్నాయి.