ఆంధ్రప్రదేశ్లో టెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం. బుధవారం (డిసెంబర్ 10) నుంచి డిసెంబర్ 21 వరకు ఆన్లైన్ మోడ్లో పరీక్షలు జరగనున్నాయి. ఈసారి టెట్ పరీక్షలకు 2.7 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 96 శాతం మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. కాగా, టెట్ దరఖాస్తుల్లో తప్పులుంటే సరిదిద్దుకునే అవకాశం కూడా కల్పించారు. మరోవైపు, సుప్రీం తీర్పుతో ఇన్సర్వీస్ టీచర్లకు కూడా ఈసారి టెట్ రాస్తున్నారు.