AP CM Chandrababu to start Double Decker buses in Vizag: ఏపీలో త్వరలోనే డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్ట్ 29న విశాఖలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు నాయుడు.. డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభించనున్నారు. విశాఖ కలెక్టర్ ఈ వివరాలను వెల్లడించారు. పర్యాటక శాఖ ఈ ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సులు ఏర్పాటు చేస్తోంది. దీంతో ఈ నెలాఖరు నుంచి విశాఖ వాసులకు కొత్త థ్రిల్ అందుబాటులోకి రానుంది.