Ap Govt Subsidies Dwcra Women Rs 35000: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్రంతో కలిసి ముమ్మరంగా చర్యలు చేపడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి యూనిట్లు ఏర్పాటు చేయడానికి, బ్యాంకు రుణాల ద్వారా ఆర్థికంగా అండగా నిలవడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆవులు, గేదెలు, మేకలు, కోళ్లు వంటి యూనిట్లతో పాటు చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తూ, భారీ రాయితీలతో మహిళలు స్వయం సమృద్ధి సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది.