Ap Govt Letter To Slbc On Dwcra Groups 10 Members Issue: ఏపీలో డ్వాక్రా గ్రూపులకు సంబంధించి 10 మంది సభ్యుల నిబంధనకు సడలింపు దిశగా అడుగులు పడుతున్నాయి. 10మంది సభ్యులు లేకున్నా రుణం మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం ఎస్ఎల్బీసీకి లేఖ రాసింది. సానుకూలంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు.. కనీసం 8 మంది ఉన్నా డ్వాక్రా సంఘాలకు రుణ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది.