Andhra Pradesh Rajya Sabha Mps Retirement: రాజ్యసభలో 73 మంది ఎంపీల పదవీకాలం మార్చి నుంచి నవంబర్ మధ్య ముగియనుంది. ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా 10 మంది, మహారాష్ట్ర నుంచి ఏడుగురు, తమిళనాడు నుంచి ఆరుగురు పదవీ విరమణ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు సభ్యులు కూడా బయటకు వెళ్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలుకానుంది, అధికార పార్టీలకే ఈ స్థానాలు దక్కే అవకాశాలున్నాయి.