Andhra Pradesh No Contaminated Cough Syrup: దేశవ్యాప్తంగా కలకలం రేపిన కల్తీ దగ్గు మందు వ్యవహారంపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. రాష్ట్రంలో కల్తీ మందు సరఫరా కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు మంత్రి. రెండేళ్లలోపు పిల్లలకు దగ్గు మందులు సూచించవద్దని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు గుంటూరులో మెలియాయిడోసిస్తో మహిళ మృతిపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.