ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్రంలో పోలీసు విభాగంలో ఉన్న ఖాళీలను భర్తి చేసేందుకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసు శాఖలో ఉన్న ఖాళీల వివరాలను.. డీజీపీ రాష్ట్ర ప్రభుత్వాని అందించారు. ప్రభుత్వం వాటిని పరిశీలించి.. అనుమతి ఇస్తే.. పోలీసు రిక్రూట్మెంట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను పటిష్టం చేయాలంటే.. పోలీస్ ఫోర్స్ అవసరమని డీజీపీ ప్రభుత్వానికి తెలిపినట్లు సమాచారం. అందుకోసం ఖాళీలను సాధ్యమైనంత త్వరగా నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.