Andhra Pradesh Goods Rail Derailed: అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొత్తవలస-కిరండూల్ మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో కలకలం రేగింది. బొర్రా-చిమిడిపల్లి మధ్య ఈ ఘటన జరగడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇనుప ఖనిజంతో వస్తున్న రైలు బోగీలు సుమారు 20 నుండి 30 వరకు పట్టాలు తప్పాయని సమాచారం. కేకే లైన్ చరిత్రలో ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడూ జరగలేదని తెలుస్తోంది. ప్రయాణికులకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.