Telangana Employees Relieved From AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన తెలంగాణకు చెందిన 58 మంది క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులను తిరిగి సొంత రాష్ట్రానికి పంపించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. అవగాహన లోపం, కారుణ్య నియామకం వంటి కారణాలతో ఏపీలో మిగిలిపోయిన వీరు, దాదాపు 11 ఏళ్లుగా సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం విధించిన షరతులకు అంగీకరించిన వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించారు.