AP Weather Today: ఆంధ్రప్రదేశ్లో వర్షాలు, పిడుగుల హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎన్టీఆర్, గుంటూరు సహా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. విజయనగరం, అల్లూరి సీతారామరాజు, గుంటూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉంది. చింతూరు ప్రాంతంలో గోదావరి, శబరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.