AP Govt 3 Lakh Housewarming Ceremonies: ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల లేని వారందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది ఉగాదికి ముందే 3లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయబోతున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. 2029 నాటికి అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు. అంతేకాదు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన డబ్బులు కూడా విడుదల చేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల భూసేకరణపై విచారణ జరుగుతోందన్నారు.