Andhra Pradesh PMAY-G Beneficiary Update: పేదల సొంతింటి కలను నిజం చేసే పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 పథకం కింద, అర్హులకు ఇళ్ల మంజూరు ప్రక్రియ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.2.50 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాయి. ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించి, నిర్మాణానికి తోడ్పడుతుంది. అర్హులైన వారిని గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు.