AP Schools Special Aadhar Camps Oct 30: ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు ముఖ్య గమనిక. స్కాలర్షిప్లు, ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఆధార్ తప్పనిసరి. చాలామంది ఆధార్లలో తప్పులున్నాయని, పదో తరగతి నామినల్ రోల్స్లో ఇబ్బందులు వస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. అందుకే, ఈ నెల 30 వరకు ప్రత్యేక ఆధార్ శిబిరాలు ఏర్పాటు చేసింది. 5 నుంచి 15 ఏళ్ల లోపు పిల్లల ఆధార్ వివరాలు సరిచేయించుకోవడానికి ఇది మంచి అవకాశం.