ఏపీలో ఫుడ్ పార్క్ ఏర్పాటు కానుందనే వార్తలు వస్తున్నాయి. రిలయన్స్ సంస్థ కర్నూలు జిల్లాలో తన తొలి ఫుడ్ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. రూ.768 కోట్లతో ఓర్వకల్లు సమీపంలో రిలయన్స్ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. రిలయన్స్ కంజ్యూమర్ ప్రొడక్ట్స్ ఈ ఫుడ్ పార్కు ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.