AP Govt Death Certificate Issuing: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ధ్రువపత్రాల జారీని సులభతరం చేస్తోంది. చాలామందికి ఈ డాక్యుమెంట్లు ఎలా పొందాలో తెలియక ఇబ్బందిపడుతున్నారు. పుట్టుక, మరణ ధ్రువపత్రాలను ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో పొందవచ్చు. ఇంటింటా సర్వే ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలను నేరుగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో ఎదురైన ఇబ్బందులను తొలగించి, ప్రజలకు సౌకర్యవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు సాగుతున్నాయి.