ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ పర్యాటక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. సోంపేట, తవిటి మండలాల్లోని మూడు ప్రధాన చిత్తడి నేలలను అనుసంధానిస్తూ.. పర్యాటక కారిడార్ను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తంగా రాష్ట్రంలో 16 చిత్తడి నేలలను గుర్తించినట్లు పేర్కొన్నారు. కొల్లేరు సరస్సు మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. జీవవైధ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడే చిత్తడి నేలల సంరక్షణకు రాష్ట్రం ప్రభుత్వం నడుం బిగించడం సానుకూలాంశం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.