Andhra Pradesh Land Conversion Guidelines: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ వినియోగ మార్పిడి దరఖాస్తులపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 30 రోజుల్లోపు పరిష్కారం కాని దరఖాస్తులను ఆమోదించినట్లే పరిగణిస్తారు. కొత్త మార్గదర్శకాలతో DPMS ద్వారా అనుమతులు పొందాలి. ఎకరాకు 4% చొప్పున వసూలు చేసే ఛార్జీల్లో 85% స్థానిక సంస్థలకు, 15% పట్టణాభివృద్ధి సంస్థలకు చెందుతుంది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి అపిలేట్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.