Land Market Value Revised In Andhra Pradesh: ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పులు, చేర్పులు జరిగాయి. సగటున 20 శాతం రిజిస్ట్రేషన్ విలువలు పెరగ్గా.. కొన్ని చోట్ల విలువలు పెరిగితే, మరికొన్ని చోట్ల తగ్గాయి. ఈ మేరకు రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ప్రకటన జారీ చేసింది. శనివారం నుంచి ఈ విలువలు అమల్లోకి వచ్చాయి. గత రెండు రోజులుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ కనిపిస్తోంది.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది.