Garlapeta New Railway Station: ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వే లైన్ల పనులు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా నడికుడి-శ్రీకాళహస్తి లైన్ కనిగిరి ప్రాంతంలో పూర్తయ్యే దశకు చేరుకుంది. భూసేకరణ, పరిహారం చెల్లింపుల్లో ఆలస్యం తొలగిపోవడంతో పనులు వేగవంతమయ్యాయి. జనవరి మొదటి వారం నుంచి కనిగిరిలో రైళ్లు పరుగులు తీసే అవకాశం ఉందని స్థానిక ఎమ్మెల్యే చెబుతుననారు. అంతేకాదు రామాయపట్నం పోర్టుకు కూడా అనుసంధానంగానూ ఈ రైల్వే లైన్ కీలక పాత్ర పోషించనుంది.