Tadepalligudem Vande Bharat Express Halt: ఏపీలో మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు కొత్తగా హాల్ట్ రాబోతోందని కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ తెలిపారు. సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్కు తాడేపల్లిగూడెం లో హాల్ట్ అంశాన్ని ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. మరో 15 రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని.. పశ్చిమగోదావరి జిల్లా ప్రాంత అభివృద్ధికి, ప్రయాణికుల సౌకర్యార్థం నిరంతరం కృషి చేస్తూనే ఉంటానన్నారు.