ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరోసారి భారీ ఎత్తున అఖిల భారత సర్వీసుల అధికారులను బదిలీ చేసింది. ఏకంగా 31 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం లభించింది. వివిధ కీలక శాఖల డైరెక్టర్లు, సెక్రెటరీలు, సీఎండీలుగా కొత్త నియామకాలు జరిగాయి. వ్యవసాయం, కుటుంబ సంక్షేమం, ఏపీపీఎస్సీ, విద్యుత్ పంపిణీ, పౌరసరఫరాలు, గృహనిర్మాణం వంటి విభాగాల అధికారుల బదిలీలు చోటుచేసుకున్నాయి. జిల్లాల్లోనూ పలువురు జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్ల స్థానాల్లో కొత్త అధికారులు బాధ్యతలు స్వీకరించనున్నారు.