ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కసరత్తు ప్రారంభమైంది. ఓటర్ల జాబితా తయారీ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. జనవరి ఒకటో తేదీ ప్రామాణికంగా ఓటర్ల జాబితా నవీకరించాలని.. మార్చి 9వ తేదీ నాటికి ఓటర్ల తుది జాబితా ప్రకటించాలని కలెక్టర్లను ఎన్నికల సంఘం ఆదేశించింది. మరోవైపు ఏపీలో మున్సిపాలిటీ, కార్పొరేషన్ల పదవీకాలం మార్చి 17తో ముగియనుంది. అలాగే గ్రామ పంచాయతీలో పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది.