Harirama Jogaiah On Rs 2000 To AP Woman: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీకి సిద్ధమవుతుండగా, మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య కీలక సూచన చేశారు. రేషన్ సరుకుల బదులు ప్రతి కుటుంబానికి నెలకు రూ.2 వేలు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనివల్ల పేదలు తమకు కావలసిన నిత్యావసరాలను కొనుక్కోగలుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదన పేదల జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది అన్నారు.