2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ఏపీ ప్రభుత్వం లక్ష్యం అని.. దాన్ని సాకారం చేసే విధంగా 'నైపుణ్యం' పోర్టల్ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. త్వరలో జరగబోయే సీసీఐ సదస్సులో ఈ పోర్టల్ ప్రారంభించాలని నిర్ణయించారు. తద్వారా యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉన్నత విద్యకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. ఇకపై ప్రతి నియోజకవర్గంలో.. ప్రతి నెలా ఉద్యోగ మేళాలు నిర్వహించాలని సూచించారు. నైపుణ్యం పోర్టల్ ద్వారా యువత విదేశాల్లోనూ ఉద్యోగ అవకాశాలు పొందొచ్చని తెలిపారు.