Andhra Pradesh Heavy Rains: ఆంధ్రప్రదేశ్కు వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. నైరుతి రుతుపవనాలు కేరళ, గోవాలో విస్తరించాయి. రానున్న రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నెల 29 వరకు ఉరుములతో కూడిన గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.