ఏపీవాసులకు బిగ్ అలర్ట్.. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రోజు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరికొన్ని గంటల్లోనూ పలు జిల్లాల్లో పిడుగులతో వానలు పడతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. హోర్డింగ్స్ కింద ఉండవద్దని.. చెట్ల కింద నిలబడవద్దని ప్రజలకు సూచించారు.