Andhra Pradesh Ration Shops Available 12 Hours: ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుదారులకు శుభవార్త! ఇకపై నిత్యావసరాలు 12 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. తిరుపతి, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కొత్త విధానం అమలు కానుంది. కొన్ని రేషన్ దుకాణాలను 'మినీ మాల్స్'గా మార్చి, జాతీయ వ్యవసాయ సహకార సొసైటీ, గిరిజన కార్పొరేషన్ల నుంచి నిత్యావసరాలను సరఫరా చేయనున్నారు. ఈ మార్పుతో ప్రజలకు మరింత సౌకర్యవంతంగా సరుకులు కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది.