ఉద్యాన, పండ్ల తోటలు సాగు చేసే రైతులు నర్సరీల నుంచి మొక్కలు కొనేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లి మొక్క లక్షణాలను, చరిత్రను తెలుసుకోవాలి. మొక్కలు లేదా నారు.. వాతావరణానికి అనుకూలమైనవో కాదో తెలుసుకోవాలి. బలమైన కాండం, సరైన ఎత్తు కలిగిన మొక్కలను.. పాలీ కవర్లలో పెంచిన వాటిని రైతులు కొనుగోలు చేయాలి. ప్రభుత్వం వద్ద నమోదు చేసుకుని లైసెన్స్ పొందిన నర్సరీలనే ఎంచుకోవాలి. ఇక నర్సరీల్లో మొక్కలు కొనేముందు రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలి. నర్సరీ యజమానులు చెప్పినట్లు ప్రమాణాలు లేకున్నా, దిగుబడి రాకపోయినా ఈ రశీదుల ద్వారా పరిహారం పొందొచ్చు.