మోంథా తుఫాన్తో ఆంధ్రప్రదేశ్ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉద్యాన పంటలు నీటిలో మునిగిపోయాయి. అయితే ఇంకా ఈ పంటలు నీటిలోనే ఉంటే చాలా ప్రమాదమని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత త్వరగా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు కొన్ని కీలక సూచనలు ఇచ్చారు. తోటల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. తెగుళ్ల నివారణకు మందులు పిచికారీ చేయాలని చెప్పారు.