AP Farmers Aadhar Urea Door Delivery: గత ఐదేళ్లలో ప్రభుత్వం భూసార పరీక్షలు చేయకుండా సూక్ష్మపోషకాలు తొలగించిందని వ్యవసాయశాక మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలు చేస్తున్నారని, వ్యవసాయ రంగంలో 15 శాతం వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు. రబీ సీజన్ నుంచి ఆధార్తో ఎరువులు ఇస్తామని, అవసరమైతే డోర్ డెలివరీ చేస్తామని తెలిపారు.