AP Pattadar Pass Book Sent In Courier: పట్టాదారు పాసుపుస్తకాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను ఇకపై నేరుగా కొరియర్ ద్వారా ఇళ్లకు పంపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీనివల్ల ప్రజల సమయం ఆదా అవుతుందని, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రావాల్సిన అవసరం ఉండదని తెలిపారు. భూముల వ్యవహారాల్లో రాజకీయ జోక్యాలను సహించబోమని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చిన భూములపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.