AP Farmers Horticulture Subsidies: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు తెచ్చే పండ్ల తోటల విస్తరణ, పాత తోటల పునరుద్ధరణ, పూల తోటల పెంపకం వంటి పథకాలతో పాటు, నీటి కుంటల ఏర్పాటుకు, పంటల రక్షణకు కూడా రాయితీలు అందిస్తోంది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని రైతులు అధిక ఆదాయం పొందాలని అధికారులు సూచిస్తున్నారు.