AP Land Re Survey New Guidelines For Farmers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల రీ-సర్వేలో రైతులకు పెద్దపీట వేస్తోంది. నోటిఫికేషన్ 13 ప్రకారం, రైతుల భాగస్వామ్యంతోనే సర్వే మొదలుపెట్టి, రికార్డులు తయారుచేసి, పాస్పుస్తకాలు ఇస్తారు. ప్రతి దశలోనూ రైతుల ఆమోదం తప్పనిసరి. ఈ కొత్త విధానం వల్ల భూముల రికార్డులు మరింత పారదర్శకంగా, వేగంగా పూర్తవుతాయని భావిస్తున్నారు. రైతుల అభ్యంతరాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఈ మేరకు మార్గదర్శకాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.