ఏపీలో రైతులకు షాక్.. అసైన్డ్ భూములపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

4 months ago 10
ఏసీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఫ్రీ హోల్డ్‌లో ఉంచిన అసైన్డ్ భూముల వివరాలను పునఃపరిశీలించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం సీఎం నిర్వహించిన రెవెన్యూ శాఖ సమీక్ష సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇలాగే ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తానని చంద్రబాబు తెలిపారు. కాగా, రెవెన్యూ సేవలను సులభతరం చేసి, భూ వివాద రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రెవెన్యూ మంత్రి తెలిపారు.
Read Entire Article