AP Farmers ECrop Booking Deadline Oct 25: ఏపీలో రైతులకు అలర్ట్.. ఈ-పంట నమోదు గడువును మరోసారి పొడిగించారు. మీ పంట వివరాలను ఈ-పంట పోర్టల్లో నమోదు చేసుకోవడానికి ఇప్పుడు మరింత సమయం ఉంది. ఈ-కేవైసీని నోటిఫైడ్ పంటలకు మాత్రమే పరిమితం చేశారు. ప్రభుత్వ పథకాలు, బీమా ప్రయోజనాలు పొందాలంటే ఈ-క్రాప్ బుకింగ్ తప్పనిసరి. ఆలస్యం చేయకండి, వెంటనే నమోదు చేసుకోండి. ఈ నెల 25 వరకు మాత్రమే అవకాశం ఉంటుంది.