Balurghat To SMVT Bengaluru Train Pendurthi Stop: ఆంధ్రప్రదేశ్లో పలు రైళ్లకు కొత్తగా హాల్ట్లు ఇచ్చారు. బాలూర్ఘాట్-బెంగళూరు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ పెందుర్తిలో ఆగనుంది. శ్రీకాకుళం జిల్లా సోంపేట ప్రజల కల నెరవేరుస్తూ, భువనేశ్వర్-విశాఖపట్నం ఇంటర్సిటీ బారువలో ఆగనుంది. తిలారు, ఇచ్ఛాపురం, కంచిలి స్టేషన్లలో కూడా కొత్త రైళ్లు ఆగడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఈ కొత్త హాల్ట్లతో దూర ప్రాంతాలకు ప్రయాణం సులభతరం కానుంది.