Experimental Halts To Some Trains Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. కేంద్ర సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లలో కొత్తగా రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, సోంపేట, బారువ స్టేషన్లలో అమృత్భారత్, పూరి ఎక్స్ప్రెస్ వంటి రైళ్లకు స్టాపింగ్ సౌకర్యం కల్పించడంతో ప్రయాణికులకు ఊరట లభించింది. రాబోయే రోజుల్లో మరిన్ని రైల్వే స్టేషన్లకు ఈ సౌకర్యం విస్తరించే అవకాశం ఉంది.