దక్షిణ మధ్య రైల్వే (SCR) బెంగళూరు- బాలూర్ఘాట్ మధ్య రెండు కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించింది. జనవరి 21 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ సర్వీసులు.. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, అనకాపల్లి మీదుగా వెళ్తున్నాయి. దీంతో ఈ ప్రాంత వాసులకు మరో రెండు సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్లు అయింది. ఎస్ఎంటీవీ బెంగళూరు- బాలూర్ఘాట్ రైలు ప్రతి బుధవారం 10.15 గంటలకు బెంగళూరు నుంచి ప్రారంభం అవుతుంది. నెల్లూరు, అనకాపల్లి, శ్రీకాకుళం మీదుగా బెంగాల్లోని బాలూర్ఘాట్కు చేరుకుంటుంది. శనివారం అక్కడి నుంచి బయలుదేరి సోమవారం ఉదయం 3.00 గంటలకు బెంగుళూరుకు చేరుకుంటుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.