Ntr Bharosa Pension Scheme In Eligible Persons: దివ్యాంగుల పింఛన్లలో అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో అనర్హులు అక్రమంగా సర్టిఫికెట్లు పొందినట్లు గుర్తించారు. ఇప్పటివరకు లక్ష మంది అనర్హులను గుర్తించి పింఛను నిలిపివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దళారులు, వైద్యులు కుమ్మక్కై ఒక్కో సర్టిఫికెట్కు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పరీక్షలకు హాజరుకాని వారిలోనూ అనర్హులు తేలారు. త్వరలోనే దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.