AP Govt New Mobiles To Anganwadi Workers: ఆంధ్రప్రదేశ్లోని అంగన్వాడీ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నెల రోజుల్లో 5జీ నెట్వర్క్తో కొత్త మొబైల్స్ ఇస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్రెడ్డి తెలిపారు. అంతేకాకుండా, ఇండక్షన్ స్టవ్ వాడటానికి ప్రతీ నెలా రూ.500 విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆయన పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో బీఎల్వో విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు, పోషణ ట్రాకర్లోని వివరాలు సంజీవని యాప్లో నమోదు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.