ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్లు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 9000 మంది మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్లు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే విజయవాడలో జరిగిన కార్యక్రమంలో 500 మంది మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్లు పంపిణీ చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని చేతుల మీదుగా విజయవాడ తూర్పు, పశ్చిమం, సెంట్రల్ నియోజకవర్గాలలోని మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్లు అందజేశారు.