NTR Bharosa Pension Update: ఆంధ్రప్రదేశ్లోని పింఛన్దారులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఫిబ్రవరి నెల పింఛన్ను జనవరి 31వ తేదీనే లబ్ధిదారులకు అందజేయాలని నిర్ణయించింది. దీనికోసం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు జనవరి 30వ తేదీనే బ్యాంకుల్లోంచి డబ్బు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు.. 2026 జనవరి 1 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.