AP Govt Rs 10 Lakh Compensation For Families Of Fishermenఫ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారులకు శుభవార్త చెప్పింది. ప్రమాదంలో మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు బీమా మొత్తాన్ని రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) కింద ఈ సాయం అందుతుంది. చేపలు పట్టే లైసెన్స్ ఉన్నవారు, సహకార సంఘ సభ్యులు ఈ పథకానికి అర్హులు. ఇది మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుంది.