Ntr Bharosa Pension Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లలోని అవకతవకలపై దృష్టి సారించింది. గత ప్రభుత్వం హయాంలో నిబంధనలు పాటించకుండా అనర్హులకు పింఛన్లు ఇచ్చినట్లు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 7.86 లక్షల పింఛన్లను పరిశీలించగా లక్ష మందికి పైగా అనర్హులుగా తేలారు. పులివెందులలో బోగస్ పింఛన్లు ఎక్కువగా ఉన్నాయని, తక్కువగా కాకినాడలో ఉన్నాయని గుర్తించారు. తప్పుడు ధ్రువపత్రాలతో పింఛన్లు పొందిన 50 వేల మందికి పైగా లబ్ధిదారులను గుర్తించి, సదరం సర్టిఫికెట్ల కోసం నోటీసులు జారీ చేశారు.