AP Fishermen Rs 5 Lakhs Compensation: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదాల్లో మరణించిన వారికి రూ.5.30 కోట్ల పరిహారం విడుదల చేసింది. ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున సాయం అందిస్తారు. మరోవైపు రాష్ట్ర పశుసంవర్ధక శాఖకు అవసరమైన పరికరాల సరఫరాకు రూ.5 కోట్ల టెండర్ ప్రక్రియను పూర్తి చేసింది. మరోవైపు, సీఎం క్యాంప్ కార్యాలయం మరమ్మతులు, ఇతర పనులకు రూ.95 లక్షలు మంజూరు చేసింది. ఈ నిర్ణయాలు ప్రజలకు ఎంతో మేలు చేయనున్నాయి.