Andhra Pradesh Farmers Rs 7 Lakhs Ex Gratia Release: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించింది. 2022 నుంచి 2024 మే వరకు ఆత్మహత్య చేసుకున్న 81 మంది రైతుల కుటుంబాలకు రూ.5.67 కోట్ల నష్టపరిహారం విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరో 104 మంది రైతుల కుటుంబాలకు రూ.7.28 కోట్ల ఎక్స్గ్రేషియా చెల్లించడానికి సిద్ధంగా ఉంది. పశుగణాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది, రాయితీపై పశుగ్రాస విత్తనాలు అందిస్తోంది. మామిడి రైతుల నుంచి మామిడి కొనుగోలును వేగవంతం చేసింది.