Andhra Pradesh Rs 1 Lakh Aid For Organ Donor Families: ఆంధ్రప్రదేశ్లో అవయవదానం చేసిన మృతుల కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రిని కోరారు. కర్నూలులో బ్రెయిన్డెడ్తో మరణించిన బాలుడి అవయవదానం ఐదుగురి ప్రాణాలను కాపాడటంతో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ ఆర్థిక సాయం అవయవదానాలను మరింత ప్రోత్సహిస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం బావుంటుంది అంటున్నారు.