AP Government incentives for Industrialists: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని పారిశ్రామికవేత్తలకు దీపావళి పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. ఏపీ పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేస్తున్న పారిశ్రామికవేత్తలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీపావళి పండుగ సందర్భంగా త్వరలోనే ఏపీలోని పారిశ్రామికవేత్తలకు తొలి విడతగా రూ.1500 కోట్లు ప్రోత్సాహకాలు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు.