ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ల పునఃపరిశీలన చేపట్టింది.జులైలో నోటీసులు అందుకున్న వారికి ఈ నెల 8 నుంచి రీఅసెస్మెంట్ జరుగుతోంది. పింఛన్ తొలగింపుపై ఆందోళన చెందవద్దని, ప్రతి దశలోనూ నోటీసులు జారీ చేస్తామని అధికారులు భరోసా ఇచ్చారు. అర్హత లేనివారిని గుర్తించేందుకు రాష్ట్రంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. అయితే దివ్యాంగుల పింఛన్ల విషయంలో.. అర్హత ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటున్నారు. అలాగే వైకల్య శాతాన్ని బట్టి పింఛన్ల కేటాయింపులో స్పష్టత ఇచ్చారు.